నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 21:58

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌.. రేపు బీఆర్ఎస్‌లో చేరనున్న జిట్టా బాలకృష్ణా రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌.. రేపు బీఆర్ఎస్‌లో చేరనున్న జిట్టా బాలకృష్ణా రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమక్షంలో బాలకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది.

హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి గురువారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 18:44

జవహర్లాల్ నెహ్రూ బిడ్డ, ఇందిరాగాంధీ కుటుంబం మొత్తం తెలంగాణ వచ్చి తెలంగాణలో కుటుంబ పాలన గురించి మాట్లాడడం హాస్యస్పదంగా ఉంది: కేటీఆర్

జవహర్ లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వచ్చి.. తెలంగాణలో కుటుంబ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విక‌లాంగుల‌ పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేసీఆర్‌ది కుటుంబ పాల‌న అని అంటున్న రాహుల్ గాంధీ ఎవ‌రు..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద నిల‌బడొచ్చు. సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. అప్పుడ‌ప్పుడు చ‌నిపోయిన ఇందిరా గాంధీని, రాజీవ్ గాంధీని, నెహ్రూని యాది చేసుకోవ‌చ్చు. కానీ కేసీఆర్‌ది మాత్రం కుటుంబ పాల‌న అంట‌రు. ఇదెక్క‌డి నీతి నాక‌ర్థం కాదు. గొంగ‌డిలో కూర్చొని ఎవ‌డ‌న్న వెంట్రుక‌లు ఏరుతాడా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ లీడ‌ర్ కాదు.. రీడ‌ర్..

కేసీఆర్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని రాహుల్ మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును రూ. 80 వేల కోట్ల‌తో నిర్మించారు. కానీ రాహుల్ గాంధీ ల‌క్ష కోట్ల అవినీతి జ‌రిగింద‌ని అంటున్న‌డు. అమెరికాలో ఉండే ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ కాంగ్రెస్ వాళ్లు పిలిచి కాళేశ్వ‌రానికి అవార్డులు ఇస్తున్నారు. కానీ ఇక్క‌డున్న కాంగ్రెసోళ్ల‌కు అయితే అర్థ‌మైత లేదు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో ల‌క్ష కోట్ల అవినీతి ఎట్ల జ‌రుగుత‌ది. కొంచెం బుర్ర‌తో ఆలోచించి మాట్లాడాలి. రాహుల్ గాంధీతో వ‌చ్చిన బాధ ఏంటంటే.. ఆయ‌న లీడ‌ర్ కాదు.. రీడ‌ర్. ఏం రాసిస్తే అది చ‌దువుతాడు పాపం. ఆయ‌న‌కేం తెల్వ‌దు.. తెల్ల‌కాగితం. తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డు అని రాహుల్‌పై కేటీఆర్ మండిప‌డ్డారు.

కాంగ్రెస్ పార్టీని బీజేపీకి త‌ప్ప‌క అమ్మేస్త‌డు..

కేసీఆర్ అవినీతి ప‌రుడు అని రాహుల్ అంటున్న‌డు.. మ‌రి రాహుల్ ప‌క్క‌కు గ‌జ‌దొంగ రేవంత్ ఉన్నాడ‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌ని కేటీఆర్ సూచించారు. అంత‌కంటే పెద్ద గ‌జ‌దొంగ ఈ దేశంలో ఎవ‌డైనా ఉన్నాడా..? ఆయ‌న ముందు దావూద్ ఇబ్ర‌హీం, చార్లెస్ శోభ‌రాజు కూడా చిన్నోళ్లు. ఆనాడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు రేటు. ఓటుకు నోటు.. సీటుకు రేటు.. రేపు రాష్ట్ర‌మంతా అమ్ముత‌డు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మిపారేస్త‌డు. అలాంటి వ్య‌క్తిని ప‌క్క‌న కూర్చొబెట్టుకుని ఇవాళ రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. పీసీసీ అధ్య‌క్షుడే పైస‌లు పంచుకుంటూ దొరికిపోయిన ద‌గుల్బాజీ. రూ. 50 కోట్లు మీ ఇంచార్జికి లంచం ఇచ్చి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి తెచ్చుకున్న దొంగ రేవంత్. ఇది వాస్త‌వ‌మో కాదో తెలుసుకోవాలంటే.. మీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ప‌క్క‌కు పిలిచి అడిగినా చెప్త‌డు. ఇక్క‌డ సీట్లు ఎక్క‌డ అమ్ముతున్న‌డు. ఎక్క‌డ విల్లాలు రాయించుకుంటున్న‌డు. ఎక్క‌డ ప్లాట్లు రాయించుకుంటున్న‌డు. కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ. ఓ ప‌ది మంది కాంగ్రెస్ నాయ‌కుల‌ను ప‌క్కకు తీసుకెళ్లి మాట్లాడి వాస్త‌వాలు తెలుసుకో. నీ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుల‌ను పిలిచి మాట్లాడు రేవంత్ బండారం బ‌య‌ట‌ప‌డ్త‌ది. దొంగ‌ను ప‌క్క‌న కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే.. గురివింద గింజ త‌న న‌లుపు ఎరుగ‌దు అన్న‌ట్లు ఉన్న‌ది క‌థ అని కేటీఆర్ విమ‌ర్శించారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 18:17

పాలస్తీనా పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలి,శాంతిని నెలకొల్పాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

పాలస్తీనా పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలి,శాంతిని నెలకొల్పాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

ఇజ్రాయిల్ పాలస్తీనా పై చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పాలస్తీనాలో ఇజ్రాయిల్ దేశం యుద్ధం పేరుతో పసిపిల్లలు చదువుకుంటున్న విద్యాసంస్థల,వైద్యశాలలపై ఇజ్రాయిల్ దేశం బాంబుల వర్షం కురిపించడంతో 500 మంది పిల్లలు దుర్మరణం చెందారని ఇది ప్రపంచ దేశాలకే సిగ్గుమాలిన చర్య అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

మూడున్నర లక్షల మంది ఇజ్రాయిల్ సైన్యం భారీ మారణాయుధాలతో మొత్తం పాలస్తీనపై బీభత్సం సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ హింసిస్తున్నారని ఇది ఇరుదేశాల మధ్య తక్షణమే శాంతి చర్చలు జరిపి శాంతి నులకలపాలని కోరుతున్నాం యుద్ధం ఇరుదేశాలకు సంబంధించింది కావాలి తప్పితే ఏకపక్ష యుద్ధం కాకూడదని మేము భావిస్తా ఉన్నాం దీనికి నరేంద్ర మోడీతో సహా ప్రభుత్వాలు మద్దతు తెలియజేయడం సిగ్గుమాలిన చర్య అని తక్షణమే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని శాంతి చర్చలు నెలకొల్పి పసిపిల్లల జీవితాన్ని, ప్రజల జీవితాలను కాపాడాలనీ ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ జోగారావు బిమ పాండు సమ్మయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 17:00

చేనేత పరిశ్రమ మరియు కార్మికుల అంశాలను వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలి

చేనేత పరిశ్రమ మరియు కార్మికుల అంశాలను వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలి

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్

   తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ పార్టీలు చేనేత పరిశ్రమ రక్షణ మరియు కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం వివిధ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చేర్చాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు

     

గురువారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ప్రతి చేనేత మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి 10 లక్షల రూపాయల పెట్టుబడి సహాయం చేనేత బంధు ప్రకటించాలని కోరారు. , చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని,చేనేత సహకార సంఘాల మరియు కార్మికుల రుణాలను మాఫీ చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేది చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వమే ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్ర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కావలసిన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని, చేనేతపైన ఉన్న జీఎస్టీ ని రద్దు చేయాలి, చేనేత సహకార సంఘాలకు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టవద్దు అని వారు అన్నారు . చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా జీవిత బీమా ఇల్లు మరియు వర్క్ షెడ్డు నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చేనేత కార్మికులకు 2వందల యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ అంశాలన్నింటినీ వివిధ రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు

    

ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, సంఘం సినియర్ నాయకులు కర్నాటి లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఆలుగొండ మధు, జిల్లా నాయకులు ఏల శ్రీనివాస్, గడ్డం దశరథ ,జిల్లా దేవదానం , రాపోలు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:55

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి..

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి


హైదరాబాద్: వినియోగదారుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఆకట్టుకునేందుకు అనేక సరికొత్త పథకాలను తీసుకొస్తొంది. తాజాగా, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది.


టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.


ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను టీఎస్ఆర్టీసీ సంస్థ అందించనుంది.

ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది.

జూబ్లీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు



దసరా పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఏపీ వాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది.ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి.


అక్టోబర్ 18 నుంచే ఈ 24 సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. జేబీఎస్ మీదుగా వెళ్లే ఈ బస్సుల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే ఛార్జీలుంటాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ను సంప్రదించవచ్చు.

ప్రస్తుతం బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావాల్సి వచ్చేది. ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.



జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపాలని సంస్థ నిర్ణయించింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక , హబ్సిగుడ, ఉప్పల్ ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోంది.

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:44

బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వల...


బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వలనకిలీ బంగారు చైన్లను చూపుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌


బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వల



అంతర్రాష్ట ముఠాలోని ఇద్దరి అరెస్టు, ఒకరు పరారీ..




రూ.7.20లక్షల విలువైన 9 తులాల బంగారం స్వాధీనం

సూర్యాపేట క్రైం, అక్టోబరు 11: బ్యాగుల వ్యాపారుల ముసుగులో ప్రజలకు నకిలీ బంగారం అంటగట్టి మోసం చేస్తున్న అంతర్రాష్ట ముఠాలోని ఇద్దరిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.20లక్షల విలువైన 9 తులాల బంగారు ఆభరణాలు, నకిలీ బంగారు చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వివరించారు.

ముగ్గురు ముఠాగా ఏర్పడి పరిచయం పెంచుకుని..

మహారాష్ట్రలోని పర్బని జిల్లా పూర్ణ గ్రామానికి చెందిన ధరంచంద్‌ కన్నయ్యలాల్‌సోలంకి, విష్ణు, గుజరాత రాష్ట్రం అహ్మదాబాద్‌ పట్టణానికి చెందిన నారాయణ బ్యాగుల వ్యాపారులు. నారాయణ ప్రస్తుతం మేడ్చల్‌ -మల్కాజిరిగి జిల్లా సరస్వతినగర్‌లో స్థిరపడ్డాడు. ఈ ముగ్గురూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ బ్యాగుల వ్యాపారం చేస్తుంటారు. ఆగస్టులో బ్యాగులు విక్రయించడానికి ఖమ్మం సమీపంలోని ఏదులాపురానికి వెళ్లారు. ఆ సమయంలో ఖమ్మంలోని కాల్వ ఒడ్డు సమీపంలోని చికెన సెంటరు నిర్వాహకురాలిని పరిచయం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన తాము రోడ్ల నిర్మాణ పనులు చేస్తామని, రోడ్ల తవ్వకాల్లో రెండు కిలోల పురాతన నాణేలు, బంగారు చైన్లు లభించాయని తెలిపారు. వాటిని స్వరాషా్ట్రనికి తీసుకువెళ్లాలంటే మార్గ మధ్యలో పోలీసుల తనిఖీలు ఉంటాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నమ్మబలికారు. అప్పటికే తమ వద్ద ఉన్న ఒక బంగారు గుండును ఆ మహిళకు ఇచ్చి తనిఖీ చేయించుకోమని చెప్పారు. దానిని ఆమె తనిఖీ చేయించగా నిజమైన బంగారంగా తేలింది. దీంతో నిందితుల వద్ద ఉన్న మొత్తం బంగారం కొనుగోలు చేయడానికి ఆ మహిళ అంగీకరించింది. మొత్తం బంగారానికి రూ.10లక్షలు ఇవ్వాలని నిందితులు కోరగా, అంత డబ్బు తన వద్ద లేదని తన వద్ద ఉన్న బంగారు అభరణాలు తీసుకుని, బంగారు చైన్లు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. అంగీకరించిన నిందితులు సూర్యాపేట ఆగస్టు 22వ తేదీన వచ్చి బంగారు ఆభరణాలు తీసుకెళ్లాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన సదరు మహిళ సూర్యాపేటకు వచ్చి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదును నిందితులకు ఇచ్చి, వారి నుంచి బంగారు చైన్లగా భావించి తీసుకుని వెళ్లింది. ఇంటికి వెళ్లి తర్వాత వాటిని తనిఖీ చేయించి అవి నకిలీ బంగారు చైన్లు అని ఆమె తెలుసుకుంది. సూర్యాపేటకు ఆగస్టు 23న ఆమె వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

స్వస్థలాలకు వెళుతుండగా ఇలా పట్టుబడ్డారు

బ్యాగుల వ్యాపారం చేస్తున్న నిందితులు బుధవారం స్వస్థలాలకు వెళ్లేందుకు ధరంచంద్‌ కన్నయ్యలాల్‌సోలంకి, నారాయణ సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌ బుధవారం ఉదయం సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌ రోడ్డు ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేస్తుండగా ఆ ఇద్దరూ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. పోలీస్‌ వాహనాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించగా, పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు.

నిందితుల బ్యాగులను తనిఖీ చేసి కొన్ని పురాతన వెండి నాణేలు, నకిలీ బంగారు చైన్లను స్వాధీనం చేసుకోవడంతో, సదరు మహిళకు చెందిన 9తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ మహిళ నుంచి తీసుకున్న రూ.లక్ష నగదును నిందితులు అప్పటికే ఖర్చు చేశారు. నిందితుల్లో విష్ణు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్ననట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, ఏపీ రాష్ట్రం అనంతపురంలో ఇలాంటి కేసులే ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు, డీఎస్పీ పరిక నాగభూషణం, సూర్యాపేట పట్టణ ఇనస్పెక్టర్‌ జి.రాజశేఖర్‌, ఎస్‌ఐ యాకుబ్‌, సిబ్బంది గొర్ల కృష్ణయ్య, గోదేశి కర్ణాకర్‌, జె.సైదులు, ఆనంద్‌, చీకూరి మధు, మీరా తదితరులు పాల్గొన్నారు.


నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:30

పండుగొచ్చింది.. పైసల్ లేవు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన..

Telangana: పండుగొచ్చింది.. పైసల్ లేవు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన..


కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల పూట చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని.. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. బతుకమ్మ పండుగకు పిల్లలకు డ్రెస్సులు కొనిచ్చే పరిస్థితి కూడా లేదని వారు బాధపడుతున్నారు.


తమకు ఏదో విధంగా జీతాలు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ శాఖల్లో పని చేస్తున్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమకు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. వీఆర్ఏలు గత ఏడాది 81 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో ప్రభుత్వం ఆగస్టు10న వీఆర్ఏలకు పేస్కేల్ ప్రకటించింది. వారిని పలు శాఖల్లో సర్దుబాటు చేసింది. దాదాపు 23 వేల మంది వీఆర్‍ఏలకు గాను14 వేల మందికి మాత్రమే అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చింది.

డిగ్రీ చదివిన వారిని జూనియర్​ అసిస్టెంట్లుగా, ఇంటర్​ చదిన వారిని రికార్డ్​అసిస్టెంట్, టెన్త్​, అంతకు తక్కువ చదివిన వారిని అటెండర్లుగా నియమించింది. అయితే నియామకాల తీరును తప్పుపడ్తూ అసలు శాఖల్లోని పలువురు ఆఫీస్​ సబ్​ఆర్డినేట్లు కోర్టుకెక్కారు. దీంతో వీఆర్​ఏలు ప్రభుత్వోద్యోగులుగా గుర్తింపు పొందినప్పటికీ కనీసం ఐడీ కార్డులు కూడా రాలేదు. రెగ్యులరైజ్​ చేసే క్రమంలో కొన్ని రూల్స్, గైడ్‍లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉండగా ఆ ప్రాసెస్‍ లేట్ చేశారు. దీంతో వీరి జీతాలు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 583 మంది కళాకారులు పనిచేస్తున్న సంగతి తేలిసిందే. అయితే వీరికి సకాలంలో జీతాలు రావడం లేదని చెబుతున్నారు. వీరికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. అక్టోబర్‍ నెల సగానికి వచ్చినా నేటికీ ఆగస్ట్​, సెప్టెంబర్‍ జీతాలు రాలేదని వారు వాపోతున్నారు. ఇటు మిషన్ భగీరథలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు రావడం లేదని తెలుస్తోంది. అటు ధరణి ఆపరేటర్లకు 7 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:21

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. టీమిండియా స్టార్‌ ఆటగాడిపై వేటు! అశ్విన్‌ రీఎంట్రీ

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. టీమిండియా స్టార్‌ ఆటగాడిపై వేటు! అశ్విన్‌ రీఎంట్రీ




వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్‌ 19న పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే పుణేకు చేరుకున్న భారత జట్టు.. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.


పుణేలోని వికెట్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్నందన అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని భారత జట్టు మేనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌ స్ధానంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌…


నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 17:28

పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కంచర్ల భూపాల్ రెడ్డి

 పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి  .... నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ & జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ...

 తనకచ్చొచ్చిన.. పానగల్లు నుండి అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం లో... కోలాహలంగా ...ఎన్నికల ప్రచారం ప్రారంభించిన..కంచర్ల

నుదుట విజయ తిలకం దిద్ది... ఘనస్వాగతం పలికిన స్థానిక కౌన్సిలర్, ఆలకుంట రాజేశ్వరి మోహన్ బాబు... ముఖ్య నాయకులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు...

 ఇంటింటికి, మంగళహారతులతో.. విజయ తిలకం దిద్దిన మహిళలు..

 పానగల్లు ఇంటింటికి కంచర్ల వెంట నడిచిన వందలాది మంది మహిళలు...

 డప్పుల మోతలతో కోలాటాల విన్యాసాలతో.... వందలాది మంది కార్యకర్తలతో హోరెత్తిన పానగల్లు.

 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజల అనంతరం

 జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్... నల్లగొండ బిఆరెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి గారిని రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు.. నల్లగొండకు తేవాలన్నా కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని... కారు గుర్తుపై ఓటు వేసి భూపాల్ రెడ్డి గారిని గెలిపించాలని నల్లగొండ అభివృద్ధిని కొనసాగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

కంచర్ల మాట్లాడుతూ... నల్లగొండ పట్టణ అభివృద్ధి1350 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని మరో రెండు సంవత్సరాలలో ఆ పనులన్నీ పూర్తి అవుతాయని... విద్యా భారతి నుండి అద్దంకి రోడ్డు వరకు... ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డును రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుకున్నామని, ఉదయ సముద్రం పక్కనే ఉన్న పానగల్లు గతంలో తాగునీరు వచ్చేవి కావని.. ఆ ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీరు అందిస్తున్నామని.. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైవే నిర్మాణం పూర్తి చేసుకున్నామని.,. ఎన్నో ప్రమాదాల కారణమైన పానగల్ బైపాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని ... గతంలో ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కడతామని హామీ ఇచ్చామని... ఒక సంవత్సరం ఎన్నికలు రెండు సంవత్సరాల కరోనాతో.. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో కొంత ఆలస్యమైందని .

ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. కెసిఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం...

 ఆసరా పెన్షన్లు ముందు 3016- ఆ తర్వాత ప్రతి సంవత్సరం 500 పెంచుతూ 5,016/- రూపాయలు.. దివ్యాంగుల పెన్షన్ 6,016 /-

 రైతుబంధు 12 వేల నుంచి 16 వేల వరకు.. విడతల వారిగా పెంచుతామని, బిపిఎల్ కుటుంబాలకు అందరికీ 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని.. గ్యాస్ సిలిండర్ ను 400 రూపాయలకే అందిస్తామని.. అర్హులైన మహిళలకు 3000 రూపాయల నెలవారి భృతి ఇస్తామనితెలిపారు.. గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్ నిలుపుకున్నారని, ఇప్పుడు ప్రకటించినవి కూడా కచ్చితంగా అమలు చేస్తారన్నారు..

 గత 20 సంవత్సరాలుగా మాయమాటలతో నల్లగొండను అభివృద్ధికి దూరం చేసిన నాయకులు, మళ్ళీ మీ ముందుకు వస్తారని వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కారు గుర్తుపై మీ ఓటు వేసి మరొక్కసారి తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపి నల్లగొండ అభివృద్ధికి దోహదపడాలని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నేడు పానగల్లు ఒకటి రెండు వార్డులలో.. సాయంత్రం 6 గంటల నుండి మూడో వార్డులో ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు 

 భారీ ఎత్తున, పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజలు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు,

నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 17:19

10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిఅమ్ముకున్నాడు: టి పి సి సి సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్

హైదరాబాద్ : 10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగిన టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్

నాడు ఓటుకు నోటు , నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు 

65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణ

తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు

ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా... పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు

రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది

వెంటనే రేవంత్ రెడ్డి ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు డిమాండ్

రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాము

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్ట్ ను ప్రక్షాళన చేయాలి

రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు

పోలీసులు తనకు రక్షణ కల్పించాలి